అడవిలో ఆగిన ఆర్టీసీ బస్సు … కాలం చెల్లిన బస్సులతో అవస్థలు

0
20 Views

వికారాబాద్ : కాలం చెల్లిన బస్సులతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. బస్సు ఎక్కిన కాడి నుండి దిగే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చోవాల్సిన పరిస్థితులు వికారాాబాద్ జిల్లాలోని ఆర్టీసీ బస్సులో నెలకొంది. ఈ మధ్యనే అనంతగిరి కొండల్లో ఆర్టీసీ బస్సు బోల్తా పడి ఓ మహిళ మరణించగా చాలా మందికి గాయాలైన విషయం తెలిసిందే. తాజాగా తాండూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అనంతగిరి కొండలు మధ్యలో ఆగిపోయింది. దీంతో  ప్రయాణికులకు కొద్దిసేపు అంతరాయం కలుగింది. ఆర్టీసీ బస్సు  ఇంజన్ హీట్ కావడంతో నీళ్లు పోశారు. బస్సులో ఉన్న ప్రయాణికులు కిందకు దిగి తిరిగి బస్సు ఎక్కి వెళ్లారు. కండిషన్ ఉన్న బస్సులను అనంతగిరి రూట్లో వేయాలని మూడు రోజుల క్రితం ఎస్పీ కార్యాలయంలో రోడ్ సేఫ్టీ విషయం చర్చ జరిగినప్పటికీ   ఆదిశగా మాత్రం చర్యలు ఉండడం లేదు.