28 Views
హైదరాబాద్ : దమ్మాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో బాలిక మిస్సింగ్ విషాదం మిగిల్చింది. దమ్మైగూడ చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది. చిన్నారి మిస్సింగ్ కేసు గా నమోదు చేసుకున్న పోలీసులు చెరువులో మృతదేహాన్ని గుర్తించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అంతకు ముందు 24 గంటలు గడిచిన పాప ఆచూకీ లేదంటూ తల్లి దండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ సిబ్బంది పోలీసుల తీరుకు నిరసనగా దమ్మాయిగూడ చౌరస్తాలో బైఠాయించిన చిన్నారి తల్లిదండ్రులు..తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించినప్పటికీ చివరకు విషాదం మిగిలింది.