దేశం మొత్తం కమలం వికసిస్తుంది: కొండా సంగీతారెడ్డి

0

వికారాబాాద్:కమలం పువ్వు అందరీ హృదయంలో ప్రతి ఇంటిలో ఉందని దేశం మొత్తం కమలం పువ్వు వికసిస్తుందని బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి సంగీతారెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ సమీపంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టణంలోని రాజీవ్ గృహకల్పలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. సౌత్ ఆఫ్రికా లో జరిగిన బ్రిక్స్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు నేను కూడా పాల్గొన్నానని మిగతా దేశాల వారు వారి దేశాల గురించి మాట్లాడితే నరేంద్ర మోడీ మాత్రం మన దేశం గురించి మాట్లాడి ప్రపంచం ఎలా బాగుండలో మాట్లాడడం జరిగిందని ఆయన విశ్వ గురువు అని పేర్కొన్నారు. దూరచూపుతో మన భవిష్యత్తు కొరకు మన పిల్లల కొరకు మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కావాలని అందుకోసం కమలం పువ్వు గుర్తుకు ఓటేసి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి, పట్టణ అధ్యక్షుడు నరోత్తం రెడ్డి, నాయకులు శిరీష, రాజేందర్ రెడ్డి, పోకల సతీష్, సుచరిత , శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు