నియోజకవర్గంలో నిరుద్యోగం లేకుండా చేస్తా : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

0
46 Views

* 3వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా
* కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్

బంట్వారం : నియోజకవర్గంలో నిరుద్యోగం లేకుండా చేస్తానని తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ… పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎంతో చేయూతనిస్తుందని అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని అన్నారు. నియోజకవర్గంలోని రోడ్లు, వంతెనలు ఎక్కడెక్కడ ఏవేవి అవసరం ఉన్నాయో వాటన్నింటినీ నూతనంగా నిర్మించే బాధ్యత నాది అని అన్నారు. రాష్రంలో నిరుద్యోగ నియంత్రణకు కాంగ్రేస్ ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక కంపెనీని ఏర్పాటు చేస్తుందని అంతులో భాగంగానే మన నియోజకవర్గానికి కూడా ఒక కంపెనీని తీసుకువస్తానని అన్నారు. దానికోసం స్థలంకూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందని అన్నారు. రైతుబంధు ఎన్ని ఎకరాలలోపు రైతులకు ఇవ్వాలనేదాని కోసం కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, వచ్చేనెల ఆగష్టు 15వ తేదీన దానిని రైతు భరోసాగా పేరుమార్చి అర్హులైన రైతులందరికీ ఒకేదఫాలో 15వేల రూపాయల పెట్టుబడి సాయం అందజేయడం జరుగుతుందన్నారు. రైతు రుణమాఫీ మార్గదర్శకాలు వచ్చాయని, ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామన్నారు. ఆరు గ్యారంటీలలో ఇప్పటికే కొన్ని చేయూతనిస్తుందని అన్నారు. ఆరు గ్యారంటీలలో ఇప్పటికే కొన్ని అమలు అవుతున్నాయని, కొన్నిరోజులలో మిగతావి కూడా అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అధికారులు, వివిధ గ్రామాల ప్రజలు తదితరులు ఉన్నారు.