వికారాబాద్ ఎర్రవల్లి చెరువులో చేపల వేటకు వెళ్లి చెరువులో వ్యక్తి గల్లంతు.

0
13 Views

వికారాబాద్: చేపల వేట కోసం వెళ్లి చెరువులో ఈత కొడుతుండగా ఓ వ్యక్తి గల్లంతైన సంఘటన వికారాబాద్ మండల పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ మండలం ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఎర్కల ఆనంతయ్య (60), సోమవారం మధ్యాహ్నం అదే గ్రామంలోని చెరువులో చేపల వేట కోసం వెళ్లాడు. వేపలు పట్టిన అనంతరం ఓడ్డుకు వచ్చిన అనంతయ్య మళ్లీ చెరువులో కాళ్లు చేతులు కడుక్కోవడానికి వెళ్లి ఈత కొట్టాడు. చెరువులో ఈ ఓడ్డు నుంచి ఆ ఓడ్డుకు వెళ్లేందుకు ప్రయత్నించిన అనంతయ్య ఊపిరి ఆడక నీటిలో మునిగిపోయాడు. ఇది గమనించిన గ్రామస్తులు వెంటనే కాపాడేందుకు ప్రయత్నించిన ప్రయోజనం లేక పోయింది. దీంతో పోలీసులుకు సమాచారం అందించగా పోలీసులు, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. కోటిపల్లి నుంచి బోట్ తెప్పించడంతో పాటు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపిన సాయంత్రం వరకు ఆచూకి లభించలేదు. పోలీసులు, ఫైర్ సిబ్బంది గ్రామస్తులు అనంతయ్య మృతదేహం కోసం గాలింపు ముమ్మరం చేశారు. అనంతయ్య గంపలు అల్లు
రూ జీవనం సాగిస్తుండగా ఆయనకు బార్య వెంకటమ్మ, కుమారుడు, కూతుళ్లు ఉన్నారు.