రోడ్డుపైకి ఏనుగుల గుంపు

0
12 Views

అనంతగిరి డెస్క్ : చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం ముసలిమడుగు వద్ద 22 ఏనుగుల గుంపు హడావుడి చేశాయి,, విపరీతమైన మంచు కురుస్తుండగా కొంతమంది గ్రామస్తులు తమ మొబైల్ ఫోన్ నందు గజరాజులను చిత్రీకరించారు.. గ్రామాల వైపు వస్తుందేమోనని అరుపులతో అటవీ మార్గంలోకి తరమడంతో ఓ మదఫుటేనుగు గింకరిస్తూ గ్రామస్తులను వెంబడించడంతో పరుగులు తీశారు.. ఈక్రమంలో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు.. 30నిమిషాల పాటు రోడ్డుపైనే అటు ఇటు తిరుగుతూ హల్చల్ చేశాయి,అటుపక్క గుడియాత్తం నుండి వచ్చే వాహనదారులు ఇటుపక్క పలమనేరు నుండి వెళ్లే వాహనదారులు ఏనుగులు వెళ్లే వరకు వేచి చూశారు. తమ గ్రామాల వైపు ఏనుగుల గుంపు వస్తే మా పిల్లలు మేము వృద్ధులు పరిస్థితి ఏంటి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు గ్రామాల వైపు ఏనుగులు రాకుండా చర్యలు చేపట్టాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు.