తాండూరు టిక్కెట్ నాకే ….కొందరు వస్తుంటారుపోతుంటారు: ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి

0
21 Views

తాండూరు : తాండూరు టిక్కెట్ నాకే వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పై నమ్మకం ఉందని  ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం పేద్దేములు మండలంలో కార్యకర్తల సమావేశం, అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తాండూరు వికారాబాద్ రోడ్డకు మంత్రి గా ఉన్న సమయంలో రూ. 60 కోట్లుమంజూరు చేయడం జరిగిందన్నారు. తాండూరు రింగ్ రోడ్డుకు రూ. 100 కోట్లు మంజూరు చేశామన్నారు. రైతులకు పరిహారం కూడా అందించడం జరిగిందన్నారు. ఈ రోజు విలేకరులసమావేశం పెట్టడానికి ముఖ్య కారణం తనకు టిక్కెట్ వస్తుందని చెప్పడం కోసమే పెట్టానన్నారు. నేను మంత్రిగా పనిచేశానని సీనియర్ నాయకుడనని తెలిపారు. ముఖ్యమంత్రిపై నమ్మకం ఉందని టిక్కెట్ ఎవరికి వస్తే వాళ్లు పోటీలోఉంటారన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని తాండూరు అభివృద్దికి 2, 3వేలు కోట్లతో చేయడం జరుగుతుందన్నారు. మధ్యనే ముఖ్యమంత్రి నిధులుతాండూరు ఇచ్చారన్నారు.  నేను చేశాను నువ్వు చేశానని అనుకుంటారని ఎవరూ చేసిన తాండూరు అభివృద్ది కోసమేనన్నారు. అన్నదమ్ములే కొట్టాడే రోజులని ఏది ఏమైనా టిక్కెట్ మాత్రం తనదేనని ఆయన స్పష్టం చేశారు.