తిరుమలలో తుఫాన్ ఎఫెక్ట్ నడకదారి బంద్

0
22 Views

తిరుపతి: మండూస్ తుఫాన్ ఎఫెక్ట్ తో శ్రీవారిమెట్టు మార్గం మూసివేశారు టీటీడీ అధికారులు.   వరద నీరు మెట్లపై ప్రవహిస్తుండడంతో అప్రమత్తమైన TTD అధికారులు…ఉదయం 8 గంటల నుంచి నడక మార్గం భక్తులకు అనుమతి నిరాకరించారు. వర్షం తగ్గేంత వరకు నడక మార్గంలో భక్తులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. భారీ వర్షాలతో నడకమార్గంలో రాళ్లు చెట్ల పొదలు అడ్డుపడుతున్నాయి. అక్కడక్కడ ఈదురు గాలులకు నడకమార్గం దెబ్బతింది.