కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి … మరికొందరి పరిస్థితి విషమం

0
19 Views

రంగారెడ్డి జిల్లా : జలమండలి నిర్లక్ష్యంతో మైలార్ దేవ్ పల్లి లో సరఫరా అవుతున్న కలుషిత జలాలు తాగి ఇద్దరు దుర్మరణమయ్యారు.. ఆఫ్రీన్ సుల్తానా (22) ఈరోజు మృతి చెందగా, నిన్న మంగళవారం మొహ్మద్ ఖైసర్ అనే యువకుడు మ్రృతిచెందాడు. అజహరుద్దీన్ (15), సమ్రీన్ బేగం(35), ఆర్.పీ సింగ్ (42), షహజాది బేగం(30)లు అస్వస్థతకు గురయ్యారు. మరోవైపు చిన్నారులు ఇత్తెషాముద్దీన్(2), ఇఖ్రాబేగం(2), మృతి చెందిన ఆఫ్రీన్ సుల్తానా కూతురు ఫైజాబేగం(6నెలలు) పరిస్థితి విషమంగా ఉంది.