వికారాబాద్(బంట్వారం):3000 కోట్లతో వికారాబాద్ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుందాం అని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు బుదవారం వికారాబాద్ నియోజకవర్గంలోని బంటారం మండల కేంద్రంలో ప్రజాపాలన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన విధంగా ఆరు గ్యారెంటీల పథకాలను మీ అందరికీ అందించే బాధ్యత తనదని, తనపై నమ్మకంతో తన గెలిపించిన అందరికీ అందుబాటులో ఉండి దశలవారీగా అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అన్నారు. అనంతరం షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ విజయకుమారి,ఎంపీపీ ప్రబాకర్,జెడ్పిటిసి కోటపల్లి సంతోషరాజు,ఎంపీటీసీ పద్మవెంకటేశం,స్ధానిక సర్పంచ్ లావణ్యశ్రీనివాస్,సర్పంచులు నర్సింహారెడ్డి,బల్వంత్ రెడ్డి,నర్సిములు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేశం, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
3000 కోట్లతో వికారాబాద్ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుందాం:స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
20 Views