రైస్ మిల్స్ ను పర్యవేక్షించిన జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్

0
17 Views

వికారాబాద్: కష్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) జనవరి 31 వ తేదీలోపు వంద శాతం ఎఫ్.సి.ఐ కి చేరవేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ రైస్ మిల్లర్లకు సూచించారు.బుధవారం యాలాల్ మండలంలోని బాలాజీ, వెంకట పద్మావతి రైస్ మిల్స్ ను అదనపు కలెక్టర్ ఆకస్మికంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రోజువారి లక్ష్యానికి అనుగుణంగా రైస్ మిల్లర్లు సిఎంఆర్ డెలివరీ చేయాలన్నారు. జిల్లాలోని రైస్ మిల్లర్లు అందరూ గడువులోపు సీఎంఆర్ ను ఎఫ్సిఐ కి చేరవేసేలా చూడాలని రైస్ మిల్లర్ల జిల్లా అధ్యక్షులకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా ధాన్యం స్టాక్, గన్ని బ్యాగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అదనపు కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేశ్వర్, రైస్ మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాలేశ్వర్ గుప్త లు పాల్గొన్నారు.