రేపటి నుండి యధావిధిగా బుకింగ్ ప్రకారం వినియోగదారులకు గ్యాస్:జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్

0
29 Views

వికారాబాద్:వికారాబాద్ గ్యాస్ వినియోగదారులకు రేపటి నుండి బుకింగ్ ప్రకారం తమ ఇంటి వద్దకే గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ ఒక ప్రకటనలో తెలియజేశారు.వికారాబాద్ పట్టణంలో గత రెండు రోజులుగా గ్యాస్ కొరత ఉందని స్థానిక అంబిక గ్యాస్ ఏజెన్సీ వద్ద చాలా మంది వినియోగదారులు క్యూ కడుతున్నారని తెలుసుకొని సంబంధిత హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ సేల్స్ అధికారితో ఆయన సంప్రదించారు. గ్యాస్ ప్లాంట్ లో సాంకేతిక సమస్యల వల్ల తాత్కాలిక అంతరాయం ఏర్పడిందని, రేపటి నుండి యధావిధిగా బుకింగ్ ప్రకారం వినియోగదారులకు గ్యాస్ ను వారి ఇంటి వద్ద అందించడం జరుగుతుందన్నారు. ఇట్టి విషయంలో ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అందరు సహకరించాలని ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు.