ఎంపీటీసీ ఆదిల్ అహ్మద్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో దుప్పట్లు పంపిణీ

0
13 Views

వికారాబాద్ : వికారాబాద్ కొంపల్లి లోని వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి నిస్సహాయుకులకు, నిరుపేదలకు మరియు వృద్ధులకు చలికాలం సందర్భంగా ఆదిల్ గ్రూప్స్ ఆధ్వర్యంలో దుప్పట్లను పంపిణీ చేశారు. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో మన్నెగూడ ఎంపీటీసీ, ఆదిల్ గ్రూప్ చైర్మన్ సయ్యద్ ఆదిల్ అహ్మద్ ఆధ్వర్యంలో దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, ఆదిల్ గ్రూప్స్ ఛైర్మన్ సయ్యద్ ఆదిల్ అహ్మద్ మాట్లాడుతూ చలి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని పండు ముసలి వాళ్ళు వున్నారని గ్రహించి అలాంటి వారి కోసం తనవంతు సాయంగా ఈ దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మనం మన ఇంటి సౌకర్యాలలో నిద్రిస్తున్నప్పుడు చాలా మంది నిస్సహాయుకులు చలిలో వీధుల్లో నిద్రపోతారు కావున మనం వారికి తోచిన సహాయం చెయ్యాలని కాబట్టి ఈ చలికాలంలో ఈ దుప్పట్లు కొంతవరకైన వారికి ఉపయోగపడతాయని మానవతా దృక్పథంతో ఈ దుప్పట్లను పంపిణీ చెయ్యడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు అఫ్జల్ షకీల్, యువ నాయకులు సిద్దిఖ్, మైనార్టీ నాయకులు మీరాసాబ్ జహీర్ పాషా, మొహమ్మద్ సలీం, సయ్యద్ అలీ, షేక్ అమీర్ హుస్సేన్, ఆదిల్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.