బాధిత కుటుంబానికి ఎస్ కే ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం

0
31 Views

వికారాబాద్(మర్పల్లి):మర్పల్లి మండల పరిధిలోని పంచలింగాల్ గ్రామంలో మాసుల బాబు అనారోగ్యంతో బాధపడుతు బుధవారం రాత్రి మృతి చెందాడు.. విషయం తెలుసుకున్న ఎస్ కే ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి  బాబు అంత్యక్రియలకు 5 వేల రూపాయలు పంపించగా గురువారం స్థానిక సర్పంచ్ సనగారి సురేందర్ రెడ్డి మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి 5 వేల నగదు అందజేశారు.. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చంద్ర శేఖర్, మొగులయ్య, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు..