బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా మాదవరెడ్డి

0
12 Views

వికారాబాద్ : బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా మాదవరెడ్డి నియామకమయ్యారని సమాచారం అందడంతో బీజేపీ నాయకులు సంబరాల్లో మునిగిపోయారు. రాష్ట్ర పార్టీ నుంచి బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా మాదవరెడ్డి
ని నియమించారని సమాచారం అందించడంతో వికారాబాద్ పట్టణంలోని ఆయన నివాసం, కార్యాలయం వద్ద నాయకులు బాణాసంచా పేల్చి మిఠాయిలు తినిపించుకుని సంబరాలు జరుపుతున్నారు. అనంతరం
శివారెడ్డిపేటలోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్ ఇంటి వద్దకు బీజేపీ నాయకులు చేరుకుని సంబురాలు జరుపుకున్నారు. పార్టీ తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుని పని చేస్తానని, అందరిని కలుపుకొని పోతానని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా నుంచి బీజేపీ మంచి ఓట్లు సాధించేందుకు కృషి చేస్తానన్నారు. పార్టీ పదవి అందించడంలో కృషి చేసిన విశ్వేశ్వర్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కర సేవకుడిగా ప్రారంభమైన నా జీవితం రామ మందిరంలో ప్రారంభోత్సవం చూస్తున్నందుకు సంతోషకరంగా ఉందన్నారు. అయితే మాదవరెడ్డి ఏబీవీపీ నాయకుడిగా మొదలైన 1992లో కరసేవకు వెళ్లారు. అనంతరం పార్టీలో కార్యకర్తగా మొదలై నేషనల్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ గా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా సేవలందరించారు. తాజాగా బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నియామకమయ్యారు.