12 Views
వికారాబాద్ : రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం స్పీకర్ నివాసానికి వెళ్లగా జడ్పీ చైర్ పర్సన్ తో పాటు దౌల్తాబాద్ జడ్పీటీసీ మహిపాల్ ఉన్నారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లాకు అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని వారు స్పీకర్ ను కోరారు. వారి వెంటా చీమల్ ధరి నరోత్తం రెడ్డి సైతం ఉన్నారు. ప్రసాద్ కుమార్ కాలు బెనుకడంతో చికిత్స పొందుతుండగా ఆరోగ్యం కోసం అడిగి తెలుసుకున్నారు.