దత్తత ద్వారా తీసుకున్న పిల్లల పాలన బాగా చూసుకొని వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

0
13 Views

వికారాబాద్:దత్తత ద్వారా తీసుకున్న పిల్లల పాలన బాగా చూసుకొని వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు.మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శిశు గృహ ద్వారా నిర్వహించిన దత్తత కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న దంపతులకు పిల్లలను దత్తత ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చట్టబద్ధంగా దత్తత తీసుకున్న పిల్లల పాలన పాలనతో పాటు వారికి మంచి భవిష్యత్తును ఇవ్వాలన్నారు. పిల్లలు ఇద్దరి సంపద అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి లలితా కుమారి,శిశు గృహమేనేజర్ తదితరులు పాల్గొన్నారు.