తన స్కూటర్ రిపేర్ చేయలేదని ఓలా షోరూంను తగలబెట్టిన యువకుడు

0
53 Views

కలబురగి, కర్ణాటక:కర్ణాటకలో కలబురగి పట్టణంలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. నదీమ్ (26) అనే యువకుడు తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రిపేర్ చేయకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురై ఓలా ఎలక్ట్రిక్ షోరూంను పెట్రోల్ పోసి తగలబెట్టాడు.20 రోజుల క్రితం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన నదీమ్, వాహనంలో సమస్యలు తలెత్తడంతో షోరూంను సంప్రదించాడు. అయితే, షోరూం సిబ్బంది తన స్కూటర్ సమస్యను సరిదిద్దేందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని నదీమ్ ఆరోపించాడు. అనేక సార్లు షోరూం వెళ్లినా కూడా, సిబ్బంది పట్టించుకోకపోవడంతో కసికి వెళ్లిన నదీమ్ పెట్రోల్ తీసుకుని షోరూంకు నిప్పంటించాడు.ఈ ఘటనలో షోరూంలో ఉన్న దాదాపు 6 స్కూటర్లు పూర్తిగా దహనం అయ్యాయి.