138 Views
మహబూబ్ నగర్, జడ్చర్ల:మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలం బోయిన్ పల్లి గ్రామంలో కరెంటు షాక్తో ఇద్దరు దొంగలు మరణించారు.ప్రగతి సోలార్ ప్లాంట్లో తరచూ కేబుల్ దొంగతనాలు జరుగుతుండడంతో సిబ్బంది అప్రమత్తమై, దొంగతనాలను అరికట్టేందుకు రెండు విద్యుత్ షాక్ కంచెలు ఏర్పాటు చేశారు.అయితే, దొంగలు మొదటి కంచెను కట్ చేసి, రెండో కంచెను కట్ చేయడానికి ప్రయత్నించగా, కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.