వికారాబాద్ గణనాథుల వద్ద ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు

0
319 Views

వికారాబాద్: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి వికారాబాద్ జిల్లా కేంద్రంలో వినాయక మండపాలను సందర్శించారు. పట్టణంలోని అతి పెద్ద వినాయకుడు ఇంద్రానగర్ వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలనీ వాసులు బొండల శ్రీనివాస్ , శ్రీనివాస్ గౌడ్ ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్బంగా ఎంపీని ఘనంగా సన్మానించారు. ఈ పూజ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాదవరెడ్డి, నియోజకవర్గ కో ఆర్డినేటర్ వడ్లనందు , బీజేపీ నాయకులు రాజేందర్ రెడ్డి, బుస్సా శ్రీకాంత్ , నరోత్తం రెడ్డి, కాలనీ వాసులు ప్రవీణ్ గౌడ్, కల్లు నవిన్ గౌడ్ , బొండల మల్లేశ్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు