సోనియా గాంధీ మెప్పు కోసమే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు: మర్పల్లిమండల BRS పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డీ

0
54 Views

వికారాబాద్ (మర్పల్లి ) : తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలనుకున్న చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారని దీనిని బీఆర్ఎస్ పార్టీ తరుపున తీవ్రంగా  ఖండిస్తున్నామని  మర్పల్లి మండల BRS పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి అన్నారు.  మంగళవారం మర్పల్లి మండల పరిధిలో రావులపల్లి గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహనికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.   తాము అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్రహన్ని తొలగిస్తామని తెలంగాణ తల్లిగౌరవం పెరిగేలా చర్యలుంటాయని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ఎదుట పెట్టడం శోచనీయమన్నారు. సోనియాగాంధీ మెప్పు కోసం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారని విమర్శించారు. ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణ తో కేసీఆర్ ది పేగుబంధం ఆయన చేసిన మంచిని తుడిచివేయాలనే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ఎన్ని కుట్రలు చేసిన తెలంగాణ సమాజం అంత గమనిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చేప్తారని అన్నారు. ఈకార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ అంజయ్య గౌడ్, మాజీ ఎంపిటీసీ రవిందర్, నాయకులు నరేందర్ రెడ్డి, మైబు, గొల్ల రమేశ్, మైలారం చంద్ర రెడ్డి, యూత్ అద్యక్షులు రాము తదితరులు పాల్గొన్నారు.