మృతురాలి అంత్యక్రియలకు ఎస్ కే ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం

0
54 Views

వికారాబాద్ (మర్పల్లి) : మర్పల్లి మండల పరిధిలోని రావులపల్లి గ్రామానికి చెందిన మాల సమ్మమ్మ (75) అనారోగ్యంతో బాధపడుతు సోమవారం రాత్రి మృతి చెందింది. గ్రామస్తుల ద్వారా అట్టి విషయం తెలుసుకున్న ఎస్ కే ఆర్ ట్రస్ట్ చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి   మృతురాలి అంత్యక్రియల 5 వేల రూపాయలు పంపించారు. స్థానిక నాయకులు గ్రామంలో ని మృతురాలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఎస్ కే ఆర్ పంపిన నగదును అందజేశారు. అబ్రహం, రమేశ్, పెంటయ్య, అంతయ్య, బల్ రాజ్, కిష్టయ్య, అమృతయ్య తదితరులు పాల్గొన్నారు.