హిరోయిన్ రకుల్ కు ఈడీ నోటీసులు

0
24 Views

డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్‌కు నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు ఈనెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. .టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురు హీరోలు, కీలక వ్యక్తులను ఈడీ గతంలో విచారించింది. తాజాగా విచారణకు హాజరు కావాలని రకుల్ ప్రీత్ సింగ్ కు నోటీసులు జారీ చేయడంతో సంచలనంగా మారింది. డ్రగ్ డీలర్లతో బ్యాంకు ట్రాన్షేషన్లపై విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు తెలిసింది. డ్రగ్స్ డీలింగ్ తో సంబంధమున్న వ్యక్తులకు డబ్బులు పంపినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పైలెట్ రోహిత్ రెడ్డి, రకుల్ ప్రీత్ సింగ్ లకు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు సమచారం.