వికారాబాద్ లో 77 కిలోల గంజాయి పట్టివేత

0
24 Views

వికారాబాద్:అక్రమంగా రైలులో గంజాయి తరలిస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో ఎక్సైజ్, ఆర్ పీ ఎప్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి గంజాయితో పాటు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ పోలీసులు, ఆర్ పీ ఎఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భువనేశ్వర్ నుంచి ముంబాయి వెళుతున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో గంజాయి తరలిస్తున్నారని పక్కా సమాచారం రావడంతో వికారాబాద్ రైల్వే స్టేషన్ లో మధ్యాహ్నం 1గంటల ప్రాంతంలో రైలు స్టాప్ లేకున్నప్పటికీ గంజాయి తరలిస్తున్నారని సమాచారంతో రైలును నిలిపి తనిఖీ చేశారు. ఏసీ బోగిలో ప్రయాణిస్తున్న లడ్విన్ ఆనంద్, మున్నా వర్ధన్, అజిత్ రాయ్ , సామియల్ రైకా ల వద్ద 77 కిలోల గంజాయిని గుర్తించారు. బెడ్ షిట్ లా మార్చి అందులో గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఎక్సైజ్, ఆర్ పీ ఎప్ పోలీసులు తెలిపారు. దాడిలో పాల్గొన్న వారు సీఐలు ఎక్సైజ్ సీఐ లు రాఘవీణా, ధన్ వంత్ రెడ్డి, ఆర్ పీ ఎఫ్ సీఐ రాజేంద్ర ప్రసాద్ , , ఎస్ ఐ లు కోటేశ్వర్ రావు, సిబ్బంది విష్ణు, హన్మంత్ , రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.