విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పర్యటన అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు

0
31 Views

పరిగి:  వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో పర్యటిస్తున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పర్యటనను పరిగి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగవర్ధన్ పూడూరు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ పర్యటనను అడ్డుకున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి త్వరగా రైతులకు సాగునీరు అందించాలన్నారు. దళిత బంధు పథకం అరులైన వారందరికీ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పరిగి పట్టణంలోని విద్యనుపురిలో ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థలో ఉన్న పాఠశాలను పునర్నిర్మించాలని మర్యాదపూర్వకంగా వెళ్లి కలిసి వారికి వివరణ ఇవ్వాలని వెళ్లగా అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.