12న వినాయక నిమజ్జన ఉత్సవాలపై సమావేశం

0
255 Views

వికారాబాద్ : ఈ నెల 12 సాయంత్రం 4 గంటలకు స్థానిక శ్రీరామ మందిరం లో వినాయక నిమజ్జనం ఉత్సవాలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని హిందూ ఉత్సవ సమితి కన్వీనర్ కృష్ణ పంతులు తెలిపారు. ఈ సమావేశంలో హిందూ బంధువులు, పుర ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, వినాయక మండప నిర్వాహకులు హాజరు కావాలని కోరారు.సమావేశంలో వినాయక నిమజ్జన ఉత్సవాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు , ఇతర కీలక అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. అందరూ ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరవ్వాలని కోరారు.