కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అబద్దాలతోనే అధికారంలోకి వచ్చింది : బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

0
39 Views

వికారాబాద్ : కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అబద్దాలతోనే అధికారంలోకి వచ్చిందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రజల రక్తమాంసాలను తింటుందని చెప్పిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడే అదే ఎల్ఆర్ఎస్ పేరుతో డబ్బులు లాగే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అని చూపిస్తుందని కానీ వారు ఇచ్చింది 420 గ్యారెంటీలన్నారు. ఆరు గ్యారెంటీలను సైతం 100 రోజుల్లో అమలు చేస్తామని ఇప్పటికీ చేయడం లేదన్నారు. గృహాజ్యోతి పథకంలో 201 యూనిట్ కాలుస్తే మొత్తం కట్టాలని షరతులు విధించిందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ నేతలు కూడా నమ్ముతున్నారని అందులో భాగంగానే మోడీ సభలో సీఎం రేవంత్ రెడ్డి బడే బాయ్ అని సంబోధించి రాష్ట్రంకు సహకరించాలని కోరాడం జరిగిందని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని కాడని కాంగ్రెస్ నేతలే చెప్పకనే చెబుతున్నారని, మళ్లీ బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ కావాలని కోరుకుంటున్నారన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రజలు పట్టం కడుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, నాయకులు వేణుగోపాల్ రెడ్డి, సుందర్ అనిల్, కౌన్సిలర్ గోపాల్, శ్రీకాంత్ రెడ్డి, రాజమల్లయ్య, కౌన్సిలర్ కృష్ణ, రాజు నాయక్, దేవదాసు తదితరులు పాల్గొన్నారు.