మృతుల కుటుంబాలకు ఎస్ కే ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం

0
14 Views

వికారాబాద్ (మర్పల్లి): మర్పల్లి మండలంలోని పట్లూర్ గ్రామంలో బెంగరి రమేష్ అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందాడు.. అలాగే పట్లూర్ తండాలో మెగానాథ్ క్యాన్సర్ తో బాధపడుతు మృతిచెందారు.. అట్టి విషయాన్ని గ్రామస్తుల ద్వారా తెలుసుకుని ఎస్ కే ఆర్ ట్రస్ట్ చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి  వారి అంత్యక్రియలకు ఒకరికి 5 వేల రూపాయల చొప్పున 10 వేలు పంపగా స్థానిక ఎంపీటీసీ స్వప్న సురేశ్ , మాజీ సర్పంచ్ సురేశ్  గ్రామస్తులతో కలిసి మృతుల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఎస్ కే ఆర్ పంపిన నగదును అందజేశారు.. ఈ కార్యక్రమంలో మోహన్, సుఖేందర్, లాలు, రాజు, నిరంజన్, శ్రీకాంత్, దిలీప్ గ్రామస్తులు పాల్గొన్నారు.