ఎల్ఆర్ఎస్ స్కీం ఉచితంగా అమలు చేయాలంటూ హరీష్ రావు సీఎంకు బహిరంగ లేఖ

0
161 Views

హైదరాబాద్:మాజీ మంత్రి హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తూ, ఎల్ఆర్ఎస్ స్కీం ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు ఉచితంగా అందిస్తామన్న స్కీమ్‌కు ఇప్పుడు ఫీజులు వసూలు చేయడం దుర్మార్గమని ఆయన విమర్శించారు. అధికారులకు టార్గెట్లు పెట్టి ప్రజలను వేధించడాన్ని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఎల్ఆర్ఎస్ కోసం ఒక్క రూపాయి కూడా కట్టొద్దని సూచిస్తూ, ఈ స్కీం ఉచితంగా అమలు చేయించే బాధ్యతను బీఆర్ఎస్ తీసుకుంటుందని హరీష్ రావు స్పష్టం చేశారు.