రక్తమైసమ్మ గుడికి సొంత డబ్బులతో రేకులు వేయించిన జన్మల మహేందర్

0
131 Views

వికారాబాద్ (మర్పల్లి):   మర్పల్లి మండల పరిధిలోని బూచన్ పల్లి గ్రామానికి చెందిన జన్మల మహేందర్ గ్రామంలోని రక్తమైసమ్మ దేవాలయం దగ్గర శుక్రవారం తన సొంత డబ్బులతో రేకుల వేయించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గత కొన్ని సంవత్సరాలుగా రక్తమైసమ్మ దేవాలయం ముందు రేకులు లేక పోవడంతో వర్షాలు బాగా పడినప్పుడు బురద మయంగా మారడంతో పాటు గ్రామంలో ఆషాఢ మాసంలో గ్రామంలో గ్రామ ప్రజలు అందరు కలిసి బోనాలు పండుగ జరుపుకుంటారని ఆ రోజు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రేకులు వేయడం జరిగిందని ఆయన తెలిపారు. దేవాలయాలకు గ్రామంలోని యువత ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆయన సూచించారు..