పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిద్దాం : రాష్ట్ర సోషల్ మీడియా సెక్రటరీ చామల. రఘుపతి రెడ్డి

0
16 Views

వికారాబాద్:పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిద్దాం అని రాష్ట్ర సోషల్ మీడియా సెక్రటరీ చామల. రఘుపతి రెడ్డి అన్నారు.మంగళవారం తెలంగాణ శాసనసభాపతి  గడ్డం.ప్రసాద్ కుమార్ నివాసంలో వికారాబాద్ నియోజకవర్గ సోషల్ మీడియా సమీక్షా సమావేశం నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ శ్రీనివాస్ ముదిరాజ్  ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ  కాంగ్రెస్ విజయంలో సోషల్ మీడియా పాత్ర చాలా ముఖ్యమైనదని,  బూత్, గ్రామ, మండల కోఆర్డినేటర్లు తమ శక్తికీ మించి పనిచేసి ఇచ్చిన ప్రతి కార్యక్రమన్ని విజయవంతం చేసారాని తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం. ప్రసాద్ కుమార్ ఆదేశాలమేరకు ఏ బాధ్యత ఇచ్చిన తూచ తప్పకుండ పాటిస్తామని వారి అడుగు జాడల్లో నడుస్తామని దీమా వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో వార్డు,గ్రామ, మండల కోఆర్డినేటర్ లు పాల్గొన్నారు