వైభవంగా బుగ్గరామలింగేశ్వర స్వామి వారి కళ్యాణం…పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు

0
197 Views

వికారాబాద్:శ్రావణ మాస చివరి సోమవారం పురస్కరించుకొని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ బుగ్గ రామలింగేశ్వర దేవాలయంలో స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణంలో ఆలయ నిర్వాహకులు ఆత్మలింగం కుటుంబ సభ్యులు కూర్చొని స్వామివారి కల్యాణం నిర్వహించగా అర్చకులు ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణం వీక్షించేందుకు వికారాబాద్ పట్టణ ప్రముఖులు పట్టణ ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు అనంతరం వీరశైవ సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దైవ ప్రసాదాన్ని స్వీకరించారు.