హైదరాబాద్ ప్రజాభవన్ లో నిర్వహించే ప్రజావాణి వాయిదా:జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

0
77 Views

వికారాబాద్:మహాత్మా జ్యోతి బా పూలే హైదరాబాద్ ప్రజాభవన్ లో ప్రతి శుక్రవారం, మంగళవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈ నెల (సెప్టెంబర్ 11) కు వాయిదా వేసినట్లు ప్రజాపాలన ప్రత్యేక అధికారి డి.దివ్య తెలిపారని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అర్జీలను స్వీకరించేందుకు ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజావాణి సందర్బంగా ఈ నెల 10 న ప్రజాభవన్ లో 16 వ కేంద్ర ఆర్థిక సంఘం తో ముఖ్యమైన సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ప్రజావాణి ని బుధవారానికి మార్చినట్లు, ఈ విషయాన్నీ అర్జీదారులు గమనించగలరని జిల్లా కలెక్టర్ తెలిపారు.