ED, CBI, IT దాడులకు బయపడను…నోటీసులు ఇస్తారని బండి సంజయ్ ముందే చెప్పారు: తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

0
19 Views

హైదరాబాద్:తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ed నోటీసులపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ. ఇవ్వాళ ED నోటీసులు పొద్దున ఇచ్చారు అనిఈ ED నోటీసులు చమత్కారంగా ఉందని అన్నారు. ED నోటీసులో ఎలాంటి కేసు వివరాలు లేకుండా నాకు ఇచ్చారు అని ED నోటీసులో నా బయోడేటా మాత్రమే అడిగారని తెలిపారు.ED నోటీసుల్లో నా బయోడేటా అడగటం అస్యాస్పదంగా ఉందని నాకు నోటీసులు ఇస్తారని బండి సంజయ్ ముందే చెప్పారని పేర్కొన్నారు నాకు నోటీసులు ఇస్తారని బండి సంజయ్ కి ఎలా తెలుసు?ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో బీజేపీ గుట్టురట్టు చేసిందందుకే ఈ నోటీసులు ఇచ్చారు అని అన్నారుతెలంగాణ అభివృద్ధిని చూడలేక కక్షసాధింపు చర్యకు పాల్పడుతున్నారు. ED నోటీసులకు భయపడేది లేదు..తగ్గేదెలేదన్నారు. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తరువాత నడుచుకుంటా.కర్ణాటక డ్రగ్స్ కేసులో నాకు నోటీసులు రాలేదన్నారు.తడిగుడ్డలతో యాదగిరి గుట్టలో ప్రమాణం చేయడానికి సంజాలు సిద్ధమా?మతం పిచ్చితో బీజేపీ ప్రజలను మభ్యపెడుతోందన్నారు.ED, CBI, IT దాడులకు బయపడను అని పేర్కొన్నారు