వికారాబాద్ జిల్లా కేంద్రంలో సైకో హల్చల్

0
20 Views

వికారాబాద్: ఓ సైకో కాలనీలోకి ప్రవేశించి అడ్డం వచ్చిన పిల్లలను పెద్దలను రాళ్లతో ఇనుప రాడుతో దాడి చేసి గాయపరిచిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో సాయంత్రం 5:30 సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఒక్కసారిగా అటుగా వచ్చే వారిపై దాడికి పాల్పడ్డాడు ఈ దాడిలో చాలామందికి గాయాలు కావడంతో స్థానిక యువకులు సాహసం చేసి సైకో వ్యక్తిని పట్టుకొని చితకబాదారు. అతన్ని తాడులతో కట్టేసి కొట్టగా సైకోకు సైతం గాయాలయ్యాయి స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా గాయాలైన వ్యక్తిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అతడు ప్రస్తుతం ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడని వివరాలు తెలియాల్సి ఉంది