కౌన్సిలర్ బొండల సువర్ణ అశోక్ ఆధ్వర్యంలో ఇందిరానగర్ వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం

0
175 Views

వికారాబాద్: వినాయక నవరాత్రి ఉత్సవాలు భాగంగా బుధవారం వికారాబాద్ పట్టణంలోని ఇంద్రనగర్ వినాయకుని వద్ద వార్డ్ కౌన్సిలర్ బోండాల సువర్ణ వారి కుటుంబ సభ్యులు బోండాల శ్రీనివాస్, బోండాల శేఖర్, బోండాల మల్లేష్, బోండాల రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.‌ ఈ పూజా కార్యక్రమంలో కాలనీ పెద్దలు శ్రీనివాస్ గౌడ్ , ప్రశాంత్ గౌడ్, విజయ్ గౌడ్, బోండాల రమేష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనగా కాలనీ వాసులు భక్తులు పెద్ద ఎత్తున తల్లి వచ్చి పూజ కార్యక్రమం లో పాల్గొని దైవ ప్రసాదాన్ని స్వీకరించారు. ఇదిలా ఉంటే  నిత్య అన్నదాన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఇంద్రనగర్ వినాయకుని వద్ద దైవ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహించే ఈ పూజా కార్యక్రమాలను కాలనీ పెద్దలు శ్రీనివాస్ గౌడ్ బోండాల శ్రీనివాస్ కాలనీవాసులు దగ్గరుండి మరి ఈ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు.