నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఏపీఓలపై సస్పెన్షన్ వేటు

0
15 Views

వికారాబాద్:2023-24 సంవత్సరంలో భాగంగా నర్సరీల నిర్వహణలో నిర్దేశించిన లక్ష్యాలకు పూర్తి చేయకుండ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఏపీవో లను జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి విధుల నుండి తాత్కాలికంగా తొలగించినట్లు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.మంగళవారం జిల్లాలో చేపడుతున్న వివిధ పనుల పురోగతిపై కలెక్టర్ దృశ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా 2023-24 సంవత్సరంలో మండలాల వారిగా నర్సరీల నిర్వహణపై లక్ష్యాలను కేటాయించగా, అట్టి లక్ష్యాలను పూర్తి చేయాలని పలుమార్లు హెచ్చరించినప్పటికీని విధుల పట్ల నిర్లక్ష్యంగా వహించిన పూడూరు మండలం ఏపీఓ యస్. రాములు, కుల్కచర్ల ఏపీఓ కే వెంకటేశ్వర్ గౌడ్ లను జిల్లా కలెక్టర్ విధుల నుండి తాత్కాలికంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందున తమ వివరణ సంబంధిత ఎంపీడీవో కు వారం రోజులలో అందజేయాలని లేనియెడల నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ అట్టి ఉత్తర్వ్యులో పేర్కొన్నారు.