రైతులను, ప్రజలను ఆదుకుంటాం:తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

0
561 Views

వికారాబాద్:అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను, ప్రజలను ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మంగళవారం వికారాబాద్ నియోజకవర్గం మోమిన్ పేట మండలంలో ఆయన జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ. జిల్లాలో 6 ఇండ్లు కూలిపోవడం జరిగిందని అదేవిధంగా నాలుగు పశువులు చనిపోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. వాటికి ప్రభుత్వం తరఫున పరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. ఎక్కువగా రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో వర్ష ప్రభావం ఉండడంతో అక్కడ తీవ్ర నష్టం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ రెండు రోజులుగా పర్యటిస్తున్నారని ములుగులో సీతక్క పర్యటిస్తున్నారని తెలిపారు వికారాబాద్ జిల్లాలో ఏ సమస్య వచ్చినా తాము ఆదుకుంటామని స్పష్టం చేశారు. మోంపేట మండలంలోని రామ్నాథ్ గుడిపల్లి గోవిందాపూర్, మల్ రెడ్డిగూడెం రైతులకు అవసరమయ్యే కత్వాలను రెండు మూడు నెలల్లో నిర్మిస్తామని తెలిపారు.