400 మంది పోలీస్ బందోబస్తుతో వచ్చి మీ ప్రతాపం అంధులు వికలాంగుల పైన చూపిస్తారా:మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

0
154 Views

అనంతగిరిడెస్క్:మహబూబ్ నగర్ లోఅంధులు, వికలాంగుల పై పోలీసుల దాడి నేపథ్యంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “చెరువుల సమీపంలో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్న వారికి నోటీసులు ఇచ్చి 30 రోజుల సమయం ఇస్తారు, కానీ అంధులు, వికలాంగులు నివసిస్తున్న ఇండ్లను మాత్రం నోటీసు లేకుండా, సమాచారం ఇవ్వకుండా 400 మంది పోలీసులతో అర్థరాత్రి కూల్చేస్తారా?” అని ప్రశ్నించారు.”సమాజంలో సరైన గౌరవం లేదని భావించి అంధులు, వికలాంగులు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ ఒకే కాలనీలో నివసిస్తున్నారు. చాలా ప్రపంచ దేశాల్లో అంధులు, వికలాంగులకు అన్ని ఫ్రీగా కట్టించి ఇస్తారు. వారు గౌరవంగా బ్రతకాలి, స్వతంత్రంగా ఉండాలని సీఎం కేసీఆర్  వారికి ₹4,000 పెన్షన్ చేశారు,” అని ఆయన అన్నారు.ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.