download
ఎస్‌కే ఆర్ ట్రస్ట్ ఆర్థిక సాయం
General

ఎస్‌కే ఆర్ ట్రస్ట్ ఆర్థిక సాయం

Tuesday, 24 February 20262 views

Advertisement

మర్పల్లి: మర్పల్లి మండలంలోని పంచలింగాల్ గ్రామానికి చెందిన పెద్ద గొల్ల పాండు అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ కే ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియల ఖర్చుల కోసం ట్రస్ట్ తరఫున రూ.5,000 ఆర్థిక సాయం పంపించారు. ఈ నగదును సనగారి సురేందర్ రెడ్డి మరియు సురేశ్ కుమార్ యాదవ్ మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ ఆంజనేయులు గౌడ్, సర్పంచ్ అభ్యర్థి సురేశ్, హరి కిషన్ రెడ్డి, మల్లా రెడ్డి, సంజీవ్ యాదవ్, వార్డు సభ్యుడు సామెల్, శేఖర్, మాణిక్యం, రవి, భాగయ్య, అనంతయ్య, భాస్కర్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

Share this article

Related Articles