
వేదిక్ హై స్కూల్లో ఘనంగా ఉగాది వేడుకలు
Advertisement
వికారాబాద్, మార్చి 18: వికారాబాద్ పట్టణంలోని వేదిక్ హై స్కూల్లో ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ వేషధారణలో పాల్గొని తెలుగు సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబించారు. పాఠశాల ప్రాంగణాన్ని పూలతో, రంగవల్లులతో అలంకరించి పండుగ వాతావరణాన్ని సృష్టించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. ముఖ్యంగా ఉగాది పచ్చడి తయారీ, కవితా పఠనం, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉగాది పచ్చడి ద్వారా జీవితంలోని ఆరు రుచుల ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, “వేదిక్ హై స్కూల్లో మేము విద్యతో పాటు సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక విలువలను సమానంగా బోధిస్తున్నాం. ఉగాది పండుగ కొత్త ఆరంభానికి సంకేతం. విద్యార్థులు విద్యలోనే కాకుండా, మన సంస్కృతిని గౌరవించే మంచి పౌరులుగా ఎదగాలి. ప్రతి విద్యార్థి తన మూలాలను గుర్తుంచుకుని, నైతిక విలువలతో ముందుకు సాగడం మా విద్యా విధానం ప్రత్యేకత” అని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సంస్కృతి పట్ల గౌరవం, సామాజిక బాధ్యత పెంపొందించడమే లక్ష్యమని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.
Share this article


