
General
పోలీసు రక్షణ కోరిన కుంభమేళా వైరల్ యువతి
Wednesday, 11 March 202612 views
Advertisement
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన మోనాలిసా భోస్లే తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్తో కలిసి కేరళలోని తిరువనంతపురం తంపానూర్ పోలీసు స్టేషన్లో పోలీసు రక్షణ కోరింది. తన ప్రేమ సంబంధాన్ని తండ్రి జై సింగ్ భోస్లే సహా కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నారని ఆమె తెలిపింది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ దాదాపు ఒకటిన్నర సంవత్సరంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. కుటుంబాల వ్యతిరేకత కారణంగా సురక్షితంగా ఉండేందుకు వారు కేరళకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముతున్న వీడియో వైరల్ కావడంతో మోనాలిసా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె “ది డైరీ ఆఫ్ మణిపూర్” చిత్ర షూటింగ్ కోసం కేరళకు వచ్చినట్లు సమాచారం.
Share this article


