
General
ఘనంగా రంజాన్ వేడుకలు.....పాల్గొన్న స్పీకర్
Saturday, 21 March 202620 views
Advertisement
వికారాబాద్: వికారాబాద్ పట్టణంలో రంజాన్ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. పట్టణంలోని ఆలంపల్లి గంగారం, శివారెడ్డిపేట్ఎ న్నెపల్లి, రాజీవ్ నగర్ ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మున్సిపల్ చైర్మన్ గడ్డం అనన్య, వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఆయా వార్డులలో ముస్లిం సోదరులు అందించిన ఆదిత్యాన్ని వారు స్వీకరించారు.
Share this article


