ప్రసాదంలో మత్తు మందు… బంగారం దోచుకెళ్లిన యువతి

0
29 Views

తిరుపతి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో యువతి మోసం చేసింది. ప్రసాదంలో మత్తు మందు ఇచ్చి బంగారం దోచుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. బస్సులో యువకుడికి పరిచయమై లాడ్జికి తీసుకెళ్లిన యువతి అనంతరం ప్రసాదంలో మత్తుమందు కలిపి ఇచ్చింది. స్పృహ కొల్పోయిన భక్తుడి నుండి 75 గ్రాముల బంగారం ,20 వేల నగదు, ఓ సెల్ ఫోన్ దొంగలించి  పరారైెంది. స్పృహలోకి వచ్చిన భక్తుడు  దోచుకెళ్లిన బంగారం, నగదు విలువ 6లక్షల రూపాయలు ఉంటుందని పేర్కొన్నాడు. బాధితుడు హైదరాబాద్ చెందిన వ్యక్తి గా గుర్తించగా పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.