ప్రిన్సిపల్ వేదింపులతో స్ర్కావెంజర్ ఆత్మహత్య

0
34 Views

కుల్కచర్ల : ప్రిన్సిపల్ వేధింపులతో మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ సుజాత చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందింది. కుల్కచర్ల మండలం బండవెల్కిచర్లకు గ్రామ పరిధిలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో సుగుణమ్మ స్ర్కావెంజర్ గా విధులు నిర్వహిస్తోంది. ఆమె అనారోగ్యానికి గురయ్యారు . దాంతో ఆమే కూతురు సుజాత విధుల్లో పాల్గొంటున్నారు . కొన్ని రోజులుగా ప్రిన్సిపల్ వివిధ కారణాలు చూపుతూ సుజాతను విధుల నుండి తొలగించగా మనస్థాపానికి గురైన ఆమె పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.