గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

0
38 Views

వికారాబాద్:గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులందరూ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆదేశించారు.మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో మాట్లాడుతూ, ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ఘనంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మండల స్థాయి, కార్యాలయాలు, పాఠశాలల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉదయం 8:00 గంటలకే పతావిష్కరణ కార్యక్రమం నిర్వహించాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 9:00 గంటలకు పతవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కలెక్టరేట్ లోని అన్ని శాఖల అధికారులు వారి సిబ్బందితో తప్పక కార్యక్రమానికి హాజరు కావాలని ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారంగా అందరిని ఆహ్వానించాలని, ప్రాంగణంలో పారిశుద్ధ్యం, త్రాగునీరు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్టాల్స్ తో పాటు సాంస్కృత కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్, వికారాబాద్ ఆర్డిఓ విజయకుమారి, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.