గణతంత్ర దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ

0
13 Views

వికారాబాద్:గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎస్పీ కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్స్ లో ఉదయం 9:00 గంటలకు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.బుధవారం ఎస్పీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో ముఖ్య అతిథి సందేశం, పోలీసు గౌరవ వందనం, విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు, వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల స్టాల్స్, విఐపి మీడియా ప్రతినిధులకు సంబంధించిన గ్యాలరీలో ఏర్పాటుతో పాటు, ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాల అందజేత తదితరులు కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, డి ఆర్ డి ఓ కృష్ణన్, వికారాబాద్ ఆర్డిఓ విజయ కుమారి, తహసిల్దార్ లక్ష్మీనారాయణ, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి అమరేందర్, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.