ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న డా. మున్నూరు రాజు

0
55 Views

వికారాబాద్: పద్య సారస్వత పీఠం తెలంగాణ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న వారిలో ZPHS సిద్ధులూర్ పాఠశాల ఉపాధ్యాయులు డా. మున్నూరు రాజు ఎంపిక అయ్యారు. వికారాబాద్ జిల్లాలో నుండి ఎంపికైన ఆయన విద్యారంగంలో చేసిన సేవలకు ఈ ప్రతిష్టాత్మక సత్కారం లభించింది.విభిన్న పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పని చేస్తూ, తన ప్రత్యేక బోధనా పద్ధతులతో విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దిన మున్నూరు రాజు విద్యారంగంలో సలహాలు, సూచనలు అందిస్తూ సేవలందిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రంగారెడ్డి జిల్లా క్షేత్ర సాహిత్యం – ఒక పరిశీలన అనే అంశంపై ఆయన డా. తూర్పు మల్లారెడ్డి పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు.తెలంగాణలోని 33 జిల్లాల నుండి ఒక్కో జిల్లాలోంచి ఒక ఉపాధ్యాయుని ఎంపిక చేసిన సందర్భంగా వికారాబాద్ జిల్లాలోని డా. మున్నూరు రాజును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ఈనాడు పత్రిక ప్రధాన సంపాదకులు డీఎన్ ప్రసాద్, ఆకెళ్ల రాఘవేంద్ర, పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు.