జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు

0
95 Views

వికారాబాద్: జాతీయ యువజన ఉత్సవాలు- 2025 లో భాగంగా జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు ఈ నెల 27న ఉదయం 10 గంటల నుంచి హరిత రిసార్ట్స్ అనంతగిరిలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి హన్మంత్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఉత్సాహవంతులైన యువతి యువకులు 15 సంవత్సరాల నుండి 29 సంవత్సరాల వరకు గలవారు జానపద బృందం నృత్యం, గీతం , జానపద సోలో వ్యక్తిగత (నృత్యం గీతం) , కథ రచన , పెయింటింగ్ ,డిక్లమేషన్/ఎల్యుకేషన్, కవిత్వం, హస్తకళ, వస్త్రకళ వ్యవసాయ ఉత్పత్తులు పోటీలో పాల్గొనాలన్నారు.
ఈ అంశాల్లో పాల్గొనదలచిన వారు వారి పేర్లను యువజన మరియు క్రీడల శాఖ అధికారి కార్యాలయంలో వాట్సాప్ ఈమెయిల్ ద్వారా తెలుపాలన్నారు.వాట్సాప్ నంబర్.9676638201 ఈమెయిల్. [email protected]కు సంప్రదించాలన్నారు.