అల్ మైటి కన్వెన్షన్ ను ప్రారంభించిన ఎంపీ రంజిత్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు

0
26 Views

వికారాబాద్ (కోట్ పల్లి): కోట్ పల్లి మండలం కరీంపూర్ గ్రామ సమీపంలోనీ మండల బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ , కరీంపూర్ సర్పంచ్ సుందరి అనిల్ నూతనంగా నిర్మించిన అల్ మైటి కన్వెన్షన్ హాలు బుధవారం చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి , వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు కలిసి అల్ మైటి కన్వెన్షన్ హాల్ ను ప్రారంభించారు. అనిల్ కుమారుని పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని వారు ఆ చిన్నారిని ఆశీర్వదించారు . ఈ కార్యక్రమంలో కోట్ పల్లి మండల నాయకులు వెంకటేష్ యాదవ్, రాంచంద్రారెడ్డి, దశరథ్ గౌడ్, సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.